(6 / 6)
ఏపీ హైకోర్టులో ఫీజులపై రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు తీర్పునకు లోబడి ఫీజులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో అత్యధిక ఫీజులు నిర్ణయించిన కాలేజీల్లో గుంటూరుకు చెందిన ఆర్వీఆర్ అండ్ జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యా పరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్ సిద్దార్థ, భీమవరం ఎస్ఆర్కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ ఉమెన్… ఉన్నాయి. వీటికి రూ.1.05 లక్షల ఫీజులు నిర్ణయించారు. భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రూ.1.03 లక్షలు, విశాఖ జీవీపీ కాలేజీ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీకి ఫీజు రూ.93,700గా నిర్ణయించారు.