వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించే వాళ్లే నిజమైన వారసులు

కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కడప పౌరుషాన్ని దిల్లీకి చాటే అవకాశం వస్తే… ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తానన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారని, ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలుపెడతామన్నారు. వైఎస్ఆర్ పాలన ఒక చెరగని ముద్ర అని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు వైఎస్ఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపీలో కొనసాగిస్తున్నారన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే యఅన్నారు. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుందన్నారు. కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here