ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో ఆదివారం యోగా గురువులు బొజ్జ ఆశోక్, ఎలిగేటి కృష్ణమూర్తి, పెద్ది మనోహార్ ఆధ్వర్యంలో మట్టి స్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ స్నానం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో సూక్ష్మ యోగా ఆసనాల సాధన చేయిస్తూ వాటి ఉపయోగాలను వివరించారు. మట్టి స్నానం వలన కలిగే ఉపయోగాలను బోధించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో మట్టి స్నానం చేయించారు. నిత్యం మట్టి స్నానం చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెల మట్టి స్నానానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని యోగ గురువు బొజ్జా అశోక్ తెలిపారు. కాగా దీనికి ఆదరణ పెరుగుతుండడంతో చాల మంది సిద్దిపేట పౌరులు క్లబ్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. మానసిక,శారీరక ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని,అధిక బరువు,నిద్ర లేమి,అజీర్ణం,మలబద్దకం,వంటి అనారోగ్యాలు దూరం అవుతాయని తెలిపారు.