AP Inter Admissions : ఏపీ ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును మరోసారి ఇంటర్ బోర్డు మరోసారి పెంచింది. విద్యార్థులు జులై 31 వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి గడువని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు. ఏపీలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు మే 22 నుంచి జూన్‌ 1 వరకు మొదటి విడత, జులై 1 వరకు రెండో విడత ప్రవేశాలు నిర్వహించారు. ఇప్పటికే అడ్మిషన్ల గడువు ఒకసారి పొడిగించగా తాజాగా మరోసారి పొడిగిస్తూ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత ఆధారంగా ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here