భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సంతోషంలో మునిగితేలుతున్నాడు. గత నెల టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన జోష్లో ఉన్నాడు. జూన్ 29వ తేదీన బార్బోడోస్ వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికాతో గెలిచి ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత్. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకుంది. అలాగే, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజ్ ఆకాశానికి చేరింది. అయితే, తాజాగా ఓ విషయంలో రోహిత్పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.