బాలిక మానసిక స్థితి బాగాలేదని
బాలిక మానసిక స్థితి బాగాలేదని, మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని గతంలో తల్లిదండ్రులకు తెలిపినట్లు ప్రిన్సిపాల్ మాన్విందర్ తెలిపారు. విద్యార్థులంతా కింద ఉంటే తాను ఒక్కతే పైకి ఎక్కిందని తెలిపారు. కాగా అనార్యోగం కారణంగా మల్లీశ్వరి జూన్ 22 పాఠశాలకు వచ్చిందని, గ్రామా పెద్దలు చెప్పడం వల్లనే లోనికి అనుమతించామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ సంఘటన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. విద్యార్థిని భవనంపై నుంచి పడడానికి గల కారణాలు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ను ఆదేశించినట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు.