ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐతో రోహిత్, కోహ్లి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి మరో ఏడెనిమిది నెలల వరకు వన్డే జట్టులో కనిపించడం అనుమానంగానే కనిపిస్తోంది. శ్రీలంక సిరీస్ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆ సిరీస్ ద్వారా వన్డేల్లోకి కోహ్లి, రోహిత్ రీఎంట్రీ ఇస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతోన్నాయి. టెస్ట్లకు మాత్రం వారు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.