శరత్ ఒక్కడే అనుకున్నారు కానీ…
భారత అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్ బేరర్గా శరత్ కమల్ వ్యవహరిస్తాడని చాలా రోజుల క్రితమే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటించింది. కానీ క్రీడల్లో లింగ వివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ సారి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రతి దేశం నుంచి ఒక్కో పురుష, మహిళా క్రీడాకారుడు ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించాలని ఒలింపిక్స్ కమిటీ నిర్ణయించింది. ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకొని పీవీ సింధుతో పాటు శరత్ కమల్ను ఫ్లాగ్ బేరర్స్గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.