శాంతి ప్రయత్నాలకు దెబ్బ

సోమవారం ఉక్రెయిన్ అంతటా రష్యా క్షిపణుల వర్షం కురిపించిందని, ఆ దాడుల్లో కనీసం 37 మంది పౌరులు మరణించారని, కీవ్ ప్రధాన పిల్లల ఆసుపత్రిని ధ్వంసం చేశారని జెలెన్స్కీ తెలిపారు. ‘రష్యా క్రూరమైన క్షిపణి దాడి ఫలితంగా ఉక్రెయిన్లో ఈ రోజు 37 మంది మరణించారు, వారిలో ముగ్గురు పిల్లలు, 13 మంది పిల్లలతో సహా 170 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ లోని అతిపెద్ద చిల్డ్రన్స్ హాస్పిటల్ పై రష్యా క్షిపణి దాడి చేసింది. పలువురు శిథిలాల కింద కూరుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్త నేరస్థుడిని మాస్కోలో కౌగిలించుకోవడం శాంతి ప్రయత్నాలకు తీవ్రమైన, వినాశకరమైన దెబ్బ’ అని జెలెన్స్కీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here