బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయ లక్ష్మి అలిగారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు.గుడి బయటనే అరుగుపై కూర్చొని తమ నిరసన తెలిపారు. వెంటనే ఆలయ కమిటి స్పందించి, అధికారులతో నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మంత్రి వెనక్కి తగ్గలేదు.