రాజేశ్‌బాబు తల, ఛాతీపై పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.అతని మృతదేహాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. దాడి చేసిన విద్యార్ధి తండ్రి చనిపోయాడని, అతని తల్లి మాత్రమే ఉందని, ఆ విద్యార్ధి తండ్రికి కూడా నేరచరిత్ర ఉన్నట్లు బంధువులు వెల్లడించారు. స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అధ్యాపకుడు ఊరుకాని ఊళ్లో దారుణ హత్యకు గురికావడం స్థానికులను విషాదంలో నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here