ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తనకు రావలసిన మొత్తం ఇవ్వాలని అడిగితే… ఇష్ట మయ్యే కదా కిడ్నీ ఇచ్చావు’ అన్నారని, గట్టిగా అడిగితే కిడ్నీలు తీసిన వాళ్లకు ప్రాణాలు తీయడం లెక్క కాదని బెదరించారని ఆరోపించాడు. తనను మోసం చేసిన బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యం, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్ బాబు, వెంకట స్వామిలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని మధుబాబువిజ్ఞప్తి చేశాడు. విజయవాడలోని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెప్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మరో ఆస్పత్రిలో ప్రతినెల 5-10 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.
Home Andhra Pradesh విజయవాడలో అంతే, పోలీసుల కనుసన్నల్లోనే అవయవాల వ్యాపారం, మరోసారి వెలుగు చూసిన కిడ్నీ రాకెట్-vijyawada organ...