అక్కినేని నాగార్జున(nagarjuna)రెండవ నట వారసుడు అఖిల్(akhil)చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. తెలుగు తెరకి దొరికిన ఇంకో మహేష్ బాబు అని కూడా చెప్పుకోవచ్చు. 2015 లో అఖిల్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలు చేసాడు. అవన్నీ కూడా పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలో అఖిల్ తీసుకున్న ఒక నిర్ణయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
అఖిల్ నుంచి వచ్చిన చివరి చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గత సంవత్సరం వచ్చిన ఏజంట్ దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.నిజానికి ఆ మూవీ మీద అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో కథల విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజా సమాచారం మేరకు అఖిల్ మరో కొత్త చిత్రానికి కూడా ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అఖిల్ కి ఒక కథ వినిపించాడని, కథ అద్భుతంగా ఉండడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.
మూవీ మొత్తం కూడా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో పక్కా విలేజ్ నేపథ్యంతో ఉండబోతుందని, అఖిల్ డైలాగులు కూడా కంప్లీట్ చిత్తూరు స్లాంగ్ లో ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త అక్కినేని అభిమానుల్లో జోష్ ని తెస్తుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్రెడీ చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో పుష్ప(pushpa)చేసి హిట్ కొట్టాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పుష్ప 2(pushpa 2) కూడా రెడీ అయ్యాడు. సో అల్లు అర్జున్ దారిలోనే అఖిల్ చిత్తురు స్లాంగ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.