టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన రాజ్ తరుణ్( Raj Tarun ) ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.లావణ్య ( Lavanya )అనే యువతి ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో రాజ్ తరుణ్ గురించి సంచలన ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణలు మరవక ముందే.రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడంటూ ఆ యువతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
రాజ్ తరుణ్ తో పాటు మాల్వీపై కూడా కేసులు పెట్టిన లావణ్య రాజ్ తరుణ్ తో పది సంవత్సరాల క్రితమే పెళ్లైందని చెప్పుకొచ్చారు.పది సంవత్సరాలుగా మేము కాపురం చేస్తున్నామని ఆమె తెలిపారు.
కొన్నేళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడని ఆమె కామెంట్లు చేశారు.నేను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు సైతం వెళ్లానని లావణ్య పేర్కొన్నారు.
మాల్వీ( Malvi ) వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని ఆమె వెల్లడించారు.
అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్ ను సైతం ఆమె పోలీసులకు అందజేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.మరోవైపు మాల్వీ మల్హోత్రా సైతం లావణ్య గురించి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రాజ్ తరుణ్ , లావణ్య కాల్ రికార్డింగ్స్ కూడా లీక్ అవుతున్నాయి.
ఈ వివాదాల వల్ల రాజ్ తరుణ్ సి( Raj Tarun ) నిమాపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుస వివాదాల వల్ల రాజ్ తరుణ్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కూడా కష్టమవుతుందని చెప్పవచ్చు.మరోవైపు పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు.లావణ్య 170 ఫోటోలను ఆధారాలుగా సమర్పించడంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారని సమాచారం అందుతోంది.