బుధవారం ఉదయం హయత్ నగర్ ఇమామ్ గూడా చెరువులోకి కారు దూసుకెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న ట్యూబులు, తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లారు. కారు డ్రైవర్తో పాటు ముగ్గురు పిల్లల్ని కాపాడారు. వారిని బయటకు తీసుకు వచ్చిన తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోడానికి చెరువులోకి కారును పోనిచ్చినట్టు తెలిసి అవాక్కయ్యారు.