యానిమల్ కీపర్ నిర్లక్ష్యం
అనంతరం సింహం బంధించి, దాని ఎన్ క్లోబర్ లోకి పంపారు. యానిమల్ కీపర్ సయ్యద్ హుస్సేన్ను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు జూ పార్క్ డైరెక్టర్ కమిటీని నియమించారు. ఈ ఘటనపై విచారించిన కమిటీ నివేదిక సమర్పించింది. యానిమల్ కీపర్ సయ్యద్ హుస్సేన్ భద్రతా చర్యలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. గేట్లు మూసివేయడంలో నిర్లక్ష్యంగా వహించినట్లు గుర్తించారు. సయ్యద్ నిర్లక్ష్యం కారణంగా సింహం బయటకు వచ్చినట్లు కమిటీ నిర్థారించింది. ఇలాంటి సంఘటనలను ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి నిపుణులను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.