నిరుద్యోగులపై ప్రభుత్వానిది దమనకాండ – బీఆర్ఎస్ నేతలు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్ ,రామచంద్ర నాయక్ ,తుంగ బాలు తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు అన్ని వర్గాల దగా పాలన నడుస్తోందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు ,యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తం అయిందన్నారు. హాస్టళ్ల లో ఫుడ్ పాయిజన్ సాధారణ విషయంగా మారిందని… చట్నీల్లో ఎలుకలు ,అన్నంలో బల్లులు వస్తున్నాయని దుయ్యబట్టారు.