అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 19 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఇద్దరు బీహార్కు చెందిన రజనీష్ కుమార్ (26), మహ్మద్ షమీమ్ (28)గా అధికారులు గుర్తించారు. మిగతా బాధితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.