Periods: మహిళ ఆరోగ్యానికీ, పీరియడ్స్ కు ఎంతో అనుబంధం ఉంది. ప్రతినెలా క్రమం తప్పకుండా మహిళకు నెలసరి వస్తుంటే ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అయితే నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలకు విపరీతమైన పొట్టనొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట దిగువ భాగంలో అంటే పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి వీపు, తొడలకు కూడా ప్రవహిస్తుంది. కొంతమందికి సూదితో గుచ్చినట్టు తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. అలాంటి వారికి రోజ్ టీ వల్ల మేలు జరుగుతుంది. ఇదొక ఇంటి చిట్కా అనుకోవాలి. గులాబీ రేకులతో చేసే ఈ రోజ్ టీ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పుల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here