శ్రీకృష్ణ జన్మస్థాన్‌లోని ఆలయాల్లో, పురాతన కేశవదేవ్ ఆలయం, ఇస్కాన్ దేవాలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 26న నిర్వహించనున్నారు. కానీ.. బృందావన్‌లోని ఏడు దేవాలయాల్లో, రాధారామన్ ఆలయం, రాధా దామోదర్ ఆలయంలో పగటిపూట జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈసారి ఈ రెండు ఆలయాల్లో ఆగస్టు 27న ఉత్సవాలు జరగనున్నాయి.

కిట్టయ్య జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని హిందువులు ఏటా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. బహుశా గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడు కావడంతో కాబోలు.. ఈ పండుగని గోకులాష్టమి అని కూడా అంటుంటారు. పరమ పవిత్రమైన ఆరోజున ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసిన అనంతరం.. శ్రీకృష్ణదేవాలయాలను దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here