డైరెక్టర్ సుకుమార్ (Sukumar) సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటే.. ఐటెం సాంగ్ పై క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్తుంది. ‘ఆర్య’లో ‘అ అంటే అమలాపురం’, ‘ఆర్య 2’లో ‘రింగ రింగ’, ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా’.. ఇలా ప్రతి సాంగ్ ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా ‘పుష్ప’లో సమంత చెందేసిన ‘ఊ అంటావా మావా’ సాంగ్ పాన్ ఇండియాని షేక్ చేసింది. దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2) ఐటెం సాంగ్ పై అందరి దృష్టి ఉంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘ఊ అంటావా మావా’ సాంగ్ ని మించేలా, ‘పుష్ప 2’ కోసం అదిరిపోయే ఐటెం సాంగ్ ని స్వరపరిచాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సాంగ్ లో మెరిసే భామ ఈమే అంటూ ఇప్పటికే ఎన్నో పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఒక సీనియర్ నటి పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు మీనాక్షి శేషాద్రి. అప్పట్లో హిందీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనాక్షి.. సౌత్ భాషల్లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో చిరంజీవితో కలిసి ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో తెరను పంచుకున్నారు. అయితే కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న మీనాక్షి శేషాద్రిని ఇప్పుడు పుష్ప 2 లో ప్రత్యేక గీతం కోసం రంగంలోకి దింపబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె వయసు 60 ఏళ్ళు. ప్రత్యేక గీతం అంటే ఎక్కువగా యంగ్ హీరోయిన్స్ తో చిందులు వేయిస్తారు. అలాంటిది పుష్ప 2 కోసం 60 ఏళ్ళ మీనాక్షిని రంగంలోకి దింపుతున్నారనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజమైతే మాత్రం.. ఆమెను ఐటెం సాంగ్ లో సుకుమార్ ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here