సాక్ష్యాధారాలు నాశనం చేసే అవకాశం

ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో ఇంకా ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఇంకా ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందనే వాదనను మేం సమర్థిస్తున్నాం. ఈ కేసును తక్షణమే సీబీఐ (CBI) కి బదిలీ చేయడం సముచితమని భావిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కేసు డైరీ, ఇతర రికార్డులను ఆగస్టు 14 బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి బదిలీ చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. నివేదిక, సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను ఆదేశిస్తున్నామని, అన్నీ రికార్డు చేసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here