విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం- జోగి రమేష్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అనంతరం జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రాజీవ్ అరెస్ట్ సమయంలో జోగి రమేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలపై జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు వద్ద నిరసన తెలిపేందుకే వెళ్లనని, దాడి చేసేందుకు కాదన్నారు. కోపముంటే తనపై కక్ష తీర్చుకోవాలని, తన కొడుకు రాజీవ్ ఏం పాపం చేశాడన్నారు. మా అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్య చదివి.. అక్కడే ఉద్యోగం కూడా చేశాడని, కానీ ఈరోజు అన్యాయంగా తన కొడుకుని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామన్నారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని ఇలా కక్ష సాధింపు తగదన్నారు. చంద్రబాబుకు ఒక కొడుకు ఉన్నారని, ఇలా తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వంకర బుద్ధి మార్చుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here