ఓఎంజీ స్టోరీ ఇదే
ఓ బంగ్లాలో ఉండే దెయ్యం, అక్కడికి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చిన గ్యాంగ్ చుట్టూ ఓఎంజీ కథ తిరుగుతుంది. చైతన్య (రజత్ రాఘవ), రజియా (నవమి గాయక్), పావురం (షకలక శంకర్) స్నేహితులుగా ఉంటారు. వీరికి డబ్బు చాలా అవసరం అవుతుంది. దీంతో డబ్బు కోసం చైతన్య ఓ ప్లాన్ చేస్తాడు. ఎమ్మెల్యే కూతురు, తన మరదలు అయిన కీర్తి (నందిత శ్వేత)ని కిడ్నాప్ చేసేందుకు సిద్ధమవుతాడు. అందుకు తగ్గట్టే ఆ ముగ్గురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఓ బంగ్లాకు తీసుకెళతారు. ఆ బంగ్లాలో ఉండే దెయ్యానికి కిడ్నాపర్లు అంటే అసలు గిట్టదు. దీంతో ఆ ముగ్గురిని భయపెడుతూ ఉంటుంది. కీర్తికి కూడా ఓ సమస్య ఉంటుంది. ఆ దెయ్యానికి కిడ్నాపర్లు అంటే ఎందుకు ఎంత కోపం? అక్కడి నుంచి ఆ నలుగురు బయటపడ్డారా? ఏ సమస్యలు ఎదుర్కొన్నారు? వెన్నెల కిశోర్ పాత్ర ఏంటి? అనే అంశాలు ఓఎంజీ సినిమాలో ఉంటాయి.