బిట్టు.. ది స్నైపర్ డాగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 2013 డిసెంబర్ 26న పోలీసులు ఒక జాగిలాన్ని చేర్చుకున్నారు. దానిని బిట్టు అని పేరు పెట్టారు. కాగా బాంబ్ స్క్వాడ్ లో చేరిన ఆ జాగిలం ప్రధానంగా ప్రధాన మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు వరంగల్ కమిషనరేట్ లో పర్యటించే సందర్భంగా పేలుడు పదార్థాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతోనే బిట్టును స్నైపర్ డాగ్ గా పిలిచేవారు. కాగా 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ జాగిలం పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవలు అందించగా, దానికి హ్యాంగ్ లర్ గా కానిస్టేబుల్ వ్యవహరించేవాడు. ఆయన ట్రైనింగ్ లో బిట్టు ఇన్నాళ్లు సేవలందించగా, 11 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పోలీసులు ఆ జాగిలానికి రిటైర్మెంట్ ప్రకటించారు.