కమిటీ కుర్రోళ్ళు సినిమాలో 11 మంది హీరోలు అంటూ ముందు నుంచి మూవీ టీమ్ ప్రోమోట్ చేస్తోంది. అందుకు తగ్గట్టే ఈ చిత్రంలో ఫ్రెండ్స్ గ్రూప్‍లో అందరికీ ప్రాధాన్యత ఉంది. కామెడీతో పాటు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రేక్షకుల మనసులను ఈ మూవీ గెలుచుకుంటోంది. ఈ సినినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా,, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, ఈశ్వర్ రాచిరాజు, లోకేశ్ కుమార్ పరిమి, అక్షయ్ శ్రీనివాస్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివకుమార్ ఫ్రెండ్స్ పాత్రలు చేశారు. గోదావరి జిల్లాలోని ఓ గ్రామం బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here