శ్రీలంకతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా.. మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మూడు వన్డేల్లో 157 పరుగులతో రాణించాడు. వరుసగా 58, 64, 35 పరుగులతో రాణించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను 0-2తో భారత్ కోల్పోయింది. అయితే, ఆ సిరీస్లో బ్యాటింగ్లో దుమ్మురేపిన రోహిత్ శర్మ.. ఐసీసీ నేడు వెల్లడించిన తాజా ర్యాంకింగ్ల్లోపైకి ఎగబాకాడు.