AarogyaSri : ఆరోగ్య శ్రీ బకాయిలపై ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకుంటే ఆరోగ్య శ్రీ సేవలు నడపలేమని స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2500 కోట్లు చెల్లించాలని ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు కోరారు. బకాయిల భారం పెరుగుతోందని, ఇకపై ఆరోగ్య శ్రీ సేవలు నడపలేమని ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఇన్ని రోజులూ బకాయిలు పెట్టినా ప్రజలకు సేవలందించామని పేర్కొ్న్నాయి. బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఉన్న బకాయిలు చెల్లించి, ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు క్రమతప్పకుండా విడుదల చేయాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసులు అందించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రోజు వారీ ఖర్చులకు కూడా నిధులు లేవని, ఆసుపత్రులు నోటీసుల్లో పేర్కొన్నాయి.
Home Andhra Pradesh రేపట్నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!-amaravati...