ఇంతకాలం జ్యోతిషం పేరుతో సెలబ్రిటీల మీద ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేసిన వేణు స్వామి ఛాప్టర్ క్లోజ్ అయ్యే దశలో వుంది. ఈ నేపథ్యంలో వేణు స్వామి భార్య, వీణ విద్వాంసురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీవాణికి పిచ్చిగానీ ఎక్కిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. గత రెండు రోజులుగా శ్రీవాణి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. తన భర్తకి అనుకూలంగా, మీడియాకి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. మీడియా వాళ్ళు అలా చేస్తారు.. ఇలా చేస్తారు.. వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. కానీ నా భర్తని మాత్రం ఎందుకిలా ట్రోల్ చేస్తారు అంటూ సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. అక్కడతో ఆగకుండా ఏ నాగచైతన్య, శోభిత ధూళిపాళ మీద కామెంట్లు చేసినందుకు వేణు స్వామి సమాజంలో తరిగిపోనంత అపకీర్తిని పోగుచేసుకున్నాడో, ఆ జంట గురించి కూడా శ్రావణి వెటకారం కామెంట్లు చేస్తున్నారు. మీకు ఎంగేజ్‌మెంట్ జరిగింది కదా.. నాకు గిఫ్ట్ ఇవ్వండి అంటూ నాగ చైతన్యని ఉద్దేశించి వీడియో పెట్టారు. ఆమె చేస్తున్న కామెంట్లు ఎంత ఫూలిష్‌గా వున్నాయో చెప్పడానికి వీల్లేనట్టుగా వుంది. ఇంతకాలం ‘వీణ శ్రీవాణి’గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీవాణి గత రెండు రోజులుగా వ్యవహరిస్తున్న తీరును చూసి ఆమెని అభిమానించేవారే తీవ్రంగా విమర్శిస్తున్నారు. శ్రీవాణికి పిచ్చిగానీ ఎక్కిందేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నీ మొగుడేమో ఆ జంట నాశనం అయిపోతుందని జోస్యం చెబుతాడు.. నువ్వేమో గిఫ్టు కావాలని అడుగుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందా అంటూనే అమెకి ఎర్రగడ్డలో ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.

వేణు స్వామి సెలబ్రిటీల జీవితాల మీద అడ్డమైన కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. అతనికి శ్రీవాణి భార్య అని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఎవరైనా సరే వేణు స్వామిని ట్రోల్ చేశారే తప్ప.. శ్రీవాణిని ఏనాడూ పల్లెత్తు మాట అన్న దాఖలాలు లేవు. ఒక వీణ కళాకారిణిగా ఆమె అంటే చాలామందికి గౌరవం వుంది. అలాంటి శ్రీవాణి ఒక్కసారిగా ఇలా మాట్లాడ్డం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదో మాటవరసకి అనడం కాదుగానీ, నిజంగానే శ్రీవాణి మానసిక పరిస్థితి మీద పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచీ శ్రీవాణికి తన భర్త సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్లు చేయడం, జ్యోతిషం చెప్పడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆమె వేణు స్వామిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఇది కంట్రోల్ అయ్యే శాల్తీ కాదు కదా.. అందుకే ‘ట్రోల్’ అవుతున్నాడు. ఆ ట్రోలింగ్ శ్రీవాణికి మొదటి నుంచి ఇబ్బంది కలిగిస్తూనే వుంది. ఇంట్లోంచి బయటకి అడుగు వేయాలన్నా ఇబ్బందిపడే పరిస్థితికి ఆమె చేరుకున్నారు. ఆమె బంధువులు, పరిచయస్తులు కూడా శ్రీవాణికి వున్న వీణ ప్రావీణ్యం గురించి మాట్లాడకుండా, వేణు స్వామి నిర్వాకాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ వుండటం కూడా ఆమెని చాలా బాధకి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో వేణు స్వామి జనం దృష్టిలో మరీ చులకన అయిపోవడం, ముఖ్యంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట మీద జోస్యం చెప్పిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వేణు స్వామిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ శ్రీవాణి మీద ప్రభావం చూపించి, ఆమె ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here