2. ఇండిపెండెన్స్ డే స్పీచ్

గౌరవనీయులైన అతిథులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు నా నమస్కారాలు. మన దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఆగస్టు 15, 1947లో మన భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ క్షణం ఇప్పటికీ మనకెంతో గర్వకారణం. ఈ మహత్తర సందర్భమే భారత దేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిందని చెప్పే ఒక సంకేతంగా మారింది. బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనాల కోసం మన దేశానికి అడుగు పెట్టారు. మన దేశాన్ని వారు అప్పట్లో ‘సోనీ కి చిడియా’ అని పిలిచేవారు. అంటే బంగారు బాతు అని అర్థం. కానీ వారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, తాము పాలన ప్రారంభించారు. మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ దేశస్థులను దేశం నుంచి వెళ్లగొట్టి బ్రిటిష్ వారు ఇక్కడ తమ పాలనను సాగించారు. కానీ వారి వివక్షపూరిత విధానాల వల్ల 1857లోనే తిరుగుబాటు మొదలయ్యింది. అప్పటినుంచి స్వాతంత్ర్య ఉద్యమం కోసం భారతీయులు పోరాడుతూనే ఉన్నారు. వందేళ్లపాటు పోరాడిన తర్వాతే మనకు స్వాతంత్ర్యం లభించింది. ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గంగాధర్ తిలక్, లాలాజపతిరాయ్, గోపాలకృష్ణ గోఖలే, రాణీ లక్ష్మీబాయి, మంగళ్ పాండే ఇలా ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు సమిధులుగా మారారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి కొత్త జీవితం వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు. వారిని మనదేశం నుండి తరిమికొట్టడంలో కష్టపడిన వీరులందరినీ మనం స్మరించుకోవాలి. మన స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన వారందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనమందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. మన దేశం పట్ల గొప్ప బాధ్యతలను నెరవేర్చాలి. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here