రెండోసారి ఖమ్మంలో
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్చి 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా ఆగస్టు 15వ తేదీన జిల్లాలో బహిరంగ సభను నిర్వహించి మరో ప్రతిష్టాత్మక పధకమైన మూడో విడత రుణమాఫీని ప్రారంభించడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే జీవిత లక్ష్యంగా శ్రమించిన తుమ్మల నాగేశ్వరరావు సొంత ఇలాఖా కావడంతో పాటు వ్యవసాయ శాఖా మంత్రిగా తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో మూడో విడత రైతు రుణ మాఫీని సీఎం ప్రారంభించడం అమిత ప్రాధాన్యతను సంతరించుకుంది.