రూ.5 లక్షలకు విక్రయం
అత్త రమాదేవితో పాటు కార్పొరేటర్ భర్త శేషగిరి కలిసి స్వప్నను ఏమార్చారు. బాబును వేరొకరికి దత్తత ఇచ్చేస్తే మరో పెళ్లి చేసుకోవచ్చని నమ్మబలికారు. దీంతో దత్తత పేరుతో బాబును నెల రోజుల కిందట నాయనమ్మ తీసుకెళ్లింది. కార్పొరేటర్ భర్త సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కు తరలించారు. దీంతో అనుమానం వచ్చిన తల్లి కార్పొరేటర్ భర్త శేషగిరి వద్దకు వెళ్లి ఆరా తీసింది. తన కొడుకు ఎక్కడ ఉన్నదీ చెప్పాలని నిలదీసింది. అయినా అతని వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె అనుమానం బలపడింది. ఇక లాభం లేదని భావించి బుధవారం ఖమ్మం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్త రమాదేవికి ఫోన్ చేసి బాబును ఖమ్మం రప్పించారు.