కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. కేసు నమోదు చేశామని చెప్పారు. రాజకీయ కారణాలు ఈ ఘటనలో కనబడటం లేదన్నారు. విచారణ చేస్తున్నామని తెలిపారు.