తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన సాగింది. అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటన జరిగింది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎయి బృందం సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు.