పాడైన గుడ్లను పెట్టడంతోనే
సంగారెడ్డి జిల్లా బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో 114 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 94 మంది విద్యార్థులు సోమవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం చేసిన గంట తర్వాత కొంతమంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడగా, మరికొంత మంది విద్యార్థులు విరేచనాలు, వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన 24 మంది విద్యార్థులను 108 వాహనంలో నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి,చికిత్స అందించారు.