ఆగష్టు 14, 1947న వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్థాన్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడి.. అధికారాన్ని బదిలీ చేశాడు. నిజానికి భారత్, పాకిస్థాన్కి ఒకేసారి అధికారాన్ని బదిలీ చేయాలని అతను ఆశించాడు. కానీ.. ఒకేరోజు న్యూఢిల్లీ, లాహోర్లో ఉండి అధికారాన్ని బదిలీ చేయడం సాధ్యంకాదని తొలుత పాకిస్థాన్కు.. ఆ తర్వాత భారత్కి అధికారాన్ని బదిలీ చేశాడు.