రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ

గత టీడీపీ హయాంలో చంద్రన్న కానుకల్లో కిలో గోధుమ పిండి, అర కిలో బెల్లం, అర కిలో శనగపప్పు, అర కిలో కందిపప్పు, అర లీటరు పామాయిల్‌, 100 మి.లీ నెయ్యి అందించేవారు. రంజాన్‌ తోఫాలో 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీ గ్రాముల నెయ్యి ఉచితంగా అందించేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న కానుకలను నిలిపివేసింది. ఏపీలో ప్రస్తుతం 1,48,43,671 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, అప్పుడప్పుడూ గోధుమ పిండి, కందిపప్పు ఇస్తున్నారు. ఇకపై ప్రతి నెలా ఉచిత బియ్యంతో పాటు చక్కెర, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు, కందిపప్పు, తృణధాన్యాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే చంద్రన్న కానుకలను తిరిగి అందించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here