పూజా విధానం

తెల్లవారుజామున నిద్ర లేచి స్నానమాచరించి పూజగది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. గడపలకు పసుపు కుంకుమ రాసుకోవాలి. పూజ గదిలో బలిపీఠం ఏర్పాటు చేసుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేసుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీ దేవి ప్రతిమను పెట్టుకోవచ్చు. లేదంటే కలశం మీద కొబ్బరికాయను ఉంచి రవిక గుడ్డ పెట్టి పసుపు, కుంకుమ రాశి అమ్మవారి రూపాన్ని చేసుకోవచ్చు. అమ్మవారిని ఆవాహనం చేస్తూ షోడపచారాలతో పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి, కనకధారా స్తోత్రం పఠించాలి. దేవతకు పండ్లు, పూలు, స్వీట్లు, సాంప్రదాయం వస్తువులు నైవేద్యంగా సమర్పించాలి. వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here