మట్టి కుండలో వంటలు చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు. మట్టికుండలో వేసిన నీరు తాగినా ఆరోగ్యానికి మంచిదే. మట్టిపాత్రలకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల వేడి ఆహారం అంతటా విస్తరిస్తుంది. ఆహారం అన్ని వైపులా ఒకేలా ఉడుకుతుంది. పోషకాలు కూడా బయటికిపోవు. అధిక రుచి కూడా వస్తుంది. మట్టి పాత్రల్లో వండిన ఆహారంలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. మట్టికుండల్లో వండే ఆహారానికి మంచి సువాసన వస్తుంది. ఆ ఆహారం తినాలన్న కోరికను పెంచుతుంది.