78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆయన పేర్కొన్నారు.