జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా… 24 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నగేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం బాలుడిని క్షేమంగా పేరెంట్స్ కి అప్పగించారు. కేసును గంటల్లోనే చేధించిన పోలీసులకు పలువురు అభినందనలు తెలిపారు.