కోల్‍కతాలో ఓ ట్రైనీ యువ వైద్యురాలు.. అమానుషంగా అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పాశవిక చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఘటనపై సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటీమణులు కరీనా కపూర్, ఆలియా భట్ నేడు (ఆగస్టు 15) ఈ ఘటనపై స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here