విచారణాదేశాలతో గందరగోళం..
ప్రొఫెసర్ మల్లారెడ్డి విషయంపై 25/6/2024న కేఎన్ రెడ్డి కేయూ వీసీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన లేకుండా పోయింది. దీంతోనే జులై 29, 30 తేదీల్లో కేఎన్ రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి అక్రమ నియామకంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఇన్ఛార్జ్ వీసీకి విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర చర్చ జరుగుతోంది.