Mahesh Babu family in Tirumala: హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార నడక మార్గంలో తిరుమలకు చేరుకొని వేంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకున్నారు. నడక మార్గంలో సితార, గౌతమ్, నమ్రతను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.