Online Bookie: హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులను జీవనోపాధిగా ఎంచుకున్నాడు. ముంబైకి చెందిన గ్యాంగ్ లతో పరిచయాలు పెంచుకుని, 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ దందా మొదలు పెట్టాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా పందెం కాయడం, వాట్సాప్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లతో వ్యవహారం అంతా నడిపించేవాడు. మొదట హైదరాబాద్ లో ఉంటూ ఈ తతంగం అంతా నడిపించగా..2019లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.