పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ..
భవిష్యత్తులో తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారబోతోందని రేవంత్ రెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో రూ.31,502 కోట్లు, దక్షిణ కొరియాలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. రెండు దేశాల్లో కలిపి 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అటు దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. కేవలం ఈ 8 నెలల కాలంలోనే తెలంగాణకు రూ.81,564 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.