ఇప్పటికే డయాబెటిస్ తో బాధపడుతున్న రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం, ఫైవర్ రిచ్ ఫుడ్స్, మంచి కొవ్వులు ఉన్న ఆహారాన్ని అధికంగా తినాలి. బ్రౌన్ రైస్, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటివి అధికంగా తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు వంటివి అధికంగా తింటే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.