భారత యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ బీసీసీఐకి ఆగ్రహం తెప్పించి టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాళీ రంజీ ట్రోఫీ ఆడాలని ఆదేశించినా.. పెడచెవిన పెట్టి వేటుకు గురయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును అతడు కోల్పోయాడు. అయితే, మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు ఇషాన్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం అతడు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‍లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ తరఫున నేడు (ఆగస్టు 16) సెంచరీతో దుమ్మురేపాడు ఇషాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here