స్కామ్ మెసేజ్ లతో జాగ్రత్త
పన్ను రీఫండ్ కు అర్హులని పేర్కొంటూ ఏదైనా సందేశం వస్తే ఆదాయ పన్ను (INCOME TAX) శాఖ అధికారిక సమాచార మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని, స్కామర్లు పంపించే లింక్స్ ను ఓపెన్ చేయవద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఎక్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ఒక పోస్ట్ షేర్ చేసింది. అనధికార, అనుమానాస్పద ఇమెయిల్స్ కు సమాధానం ఇవ్వవద్దు. అలాగే, క్రెడిట్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే వెబ్సైట్లను సందర్శించవద్దు. ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఇమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి’’ అని ఐటీ విభాగం వివరించింది.