“మా కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాను. తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉంటా. తప్పుడు కేసులకు భయపడే రకం కాదు. 2019లో చంద్రబాబు డ్రోన్ కేసు, గురుజాలలో కార్యకర్తల పరామర్శ, ఛలో ఆత్మకూరు ఘటనలో మిగిలిన టీడీపీ నేతల లాగా నేను పారిపోలేదు. దమ్ము ధైర్యంతోనే ముందుకు వెళ్లా. నా గురించి తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా తెలుసు, మా తండ్రి దేవినేని రాజశేఖర్ గారు మాకు జన్మనివ్వటమే కాదు ధైర్యంగా ఎలా ఉండాలో కూడా నేర్పించారు” అంటూ అవినాష్ బదులిచ్చారు.